రాపూరులో జేసీ పర్యటన
ABN , First Publish Date - 2022-08-17T03:20:38+05:30 IST
రాపూరు మండలంలో జేసీ కూర్మనాథ్ మంగళవారం పర్యటించారు.మండలంలో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ కోసం సేకరించాల్సిన భూ
రాపూరు, ఆగస్టు 16: రాపూరు మండలంలో జేసీ కూర్మనాథ్ మంగళవారం పర్యటించారు.మండలంలో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ కోసం సేకరించాల్సిన భూముల మ్యాప్లను పరిశీలించారు. మండలంలో ప్రస్తుతం ఉన్న కృష్ణపట్నం-ఓబులవారిపల్లి రైల్వేలైన్కు పశ్చిమాన ఈ రైల్వేలైన్ వస్తున్న విషయాన్ని అధికారులు ఆయనకు వివరించారు. మండలంలో కండలేరు డ్యాం నుంచి రాపూరు వరకు సేకరించాల్సిన భూములు, అందులోని ప్రభుత్వ భూముల గురించి తెలుసుకుని ఆ ప్రభుత్వ భూముల్లో ఉన్న చెరువులు, కాలువలను పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో కాలువలు, చెరువులు ఉన్నాయో గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలను అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం జేసీ కంబాలపల్లి, సంకురాత్రిపల్లి గ్రామ సచివాలయాలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దారు పద్మావతి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.