అత్యాచార నిందితులను వదిలిపెట్టేది లేదు

ABN , First Publish Date - 2020-10-20T06:51:08+05:30 IST

ఇటీవలి కాలంలో రాజవొమ్మంగి మండలంలో బాలికలపై అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి హెచ్చరించారు. జడ్డంగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అత్యాచారానికి గురైన బాలిక గ్రామమైన చిన్నయ్యపాలేనికి సోమవారం ఆమె వెళ్లారు.

అత్యాచార నిందితులను వదిలిపెట్టేది లేదు

  • ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి

రాజవొమ్మంగి, అక్టోబరు 19: ఇటీవలి కాలంలో రాజవొమ్మంగి మండలంలో బాలికలపై అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి హెచ్చరించారు. జడ్డంగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అత్యాచారానికి గురైన బాలిక గ్రామమైన చిన్నయ్యపాలేనికి సోమవారం ఆమె వెళ్లారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోయినా కాలి నడకన వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, నిందితులను శిక్షిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ, అడపా కామేష్‌, గణజాల తాతారావు, చిన్నా, సింగిరెడ్డి రవి ఉన్నారు. 





Updated Date - 2020-10-20T06:51:08+05:30 IST