బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-07-28T06:45:23+05:30 IST

మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఓ వృద్ధుడు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది.

బాలికపై అత్యాచారం


పోలీసుల అదుపులో నిందితుడు 

తనకల్లు, జూలై 27: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఓ వృద్ధుడు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలివి. బాధిత బాలిక తల్లి కువైట్‌లో ఉంది. తండ్రి ఓ డాబాహోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో బాలిక తన అవ్వ వద్ద ఉంటుండగా, అదే గ్రా మానికి చెందిన మౌలాలీ అలియాస్‌ జిన్నాసాబ్‌ (67) కన్నేశా డు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న వృద్ధుడు.. గత మూడు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. సోమవారం అవ్వకు అనుమానం వచ్చి బాలికను నిలదీయగా, జరిగిన విషయాన్ని చెప్పింది. బాలిక మేనమామ ఫిర్యాదు మే రకు పోలీసులు వృద్ధుడిపై అత్యాచారం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కదిరి ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన గ్రామంలో కలకలం రేకెత్తించింది. విషయం తెలుసుకున్న కదిరి రూరల్‌ సీఐ మధు తనకల్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో ఘటనపై ఆరా తీశారు. నిం దితున్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరారు. గ్రామంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.  


Updated Date - 2021-07-28T06:45:23+05:30 IST