కొండయ్యపాలెంలో విద్యార్థినిని అత్యాచారం చేసిన స్కూల్ కరెస్పాండెంట్
ABN , First Publish Date - 2022-06-06T01:17:05+05:30 IST
Kakinada: హైదరాబాద్ జూబ్లిహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన మరువక ముందే ఏపీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కొండయ్యపాలెంలో హెల్పింగ్
Kakinada: హైదరాబాద్ జూబ్లిహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన మరువక ముందే ఏపీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కొండయ్యపాలెంలో హెల్పింగ్ హాండ్స్ స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థినిని అత్యాచారం చేశాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక హెల్పింగ్ హాండ్స్ స్కూల్ హస్టల్లో ఉంటూ చదువు కుంటుంది. ఈ క్రమంలో స్కూల్ కరస్పాండెంట్ విజయ్ కుమార్ బాలికను లోబరుచుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు. స్కూల్కు సెలవులు ఇవ్వడంతో బాలిక ఇంటికి వెళ్లింది. కొద్ది రోజులకు వాంతులు, రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై డీఎస్పీ మురళీమోహన్ మాట్లాడుతూ..
‘‘హెల్పింగ్ హాండ్స్ స్కూల్ కరస్పాండెంట్ వయసు 60 సంవత్సరాలు. బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు విజయ్ కుమార్పై కేసు నమోదు చేశాం. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం. హెల్పింగ్ హాండ్స్ స్కూల్లో ఎల్.కె.జీ నుంచి వివిధ తరగతుల్లో చదువుతున్న పిల్లల 40 మంది వరకు ఉన్నారు. బాలికకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయ్ కుమార్ గురించి మరింత లోతుగా విచారణ చేస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.