జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులు వాస్తవాలను దాస్తున్నారు: వైఎస్ షర్మిల
ABN , First Publish Date - 2022-06-04T18:09:28+05:30 IST
Hyderabad: జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం చాలా
Hyderabad: జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం చాలా దారుణమన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కొందరు అధికార పార్టీ నాయకుల కొడుకులపై పోలీసులు చర్యతీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ కేసులో హోం మంత్రి మనవడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయని, పోలీసులు వాస్తవాలను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగి వారం రోజులు అయినా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.