అత్యాచారం కేసులో సవితి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-06-22T16:17:56+05:30 IST

కూతురిపై అత్యాచారానికి పాల్పడిన సవితి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పదో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కవిత మంగళవారం తీర్పునిచ్చారు. కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌

అత్యాచారం కేసులో సవితి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్/బర్కత్‌ పుర: కూతురిపై అత్యాచారానికి పాల్పడిన సవితి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పదో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కవిత మంగళవారం తీర్పునిచ్చారు. కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లా ఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ మంత్రాలయంకు చెందిన ఓ వివాహిత తన భర్త చనిపోవడంతో మహ్మద్‌ జహంగీర్‌(35)ను రెండో పెళ్లి చేసుకుంది. ఆ వివాహితకు 13 ఏళ్ల వయస్సు గల కూతురు ఉంది. ఉపాధి కోసం నగరానికి వచ్చి బర్కత్‌పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జహంగీర్‌ వాచ్‌మన్‌గా పనిచేశాడు. భార్య ఇళ్లలో పాచి పని చేయడానికి ప్రతి రోజూ ఉదయమే వెళ్లిపోయేది. ఈ క్రమంలో జహంగీర్‌ తన సవితి కూతురుపై మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంబర్‌పేటలో నివాసముండే అతడి తమ్ముడు మహ్మద్‌ భాష(32) బాలికను తన గదికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు.


ఈ విషయమై 2017లో బాధిత బాలిక తాను చదివే పాఠశాలలో ఉపాధ్యాయురాలికి తనపై జరిగిన అత్యాచారాన్ని చెప్పింది. వెంటనే స్పందించిన ఆ ఉపాధ్యాయురాలు బాలికను వెంట తీసుకొని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. నాడు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది. పదో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కవిత సవితి తండ్రి మహ్మద్‌  జహంగీర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా, అతడి సోదరుడు మహ్మద్‌ భాషాకు 3 ఏళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

Updated Date - 2022-06-22T16:17:56+05:30 IST