అత్యాచార ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలి : భట్టి విక్రమార్క
ABN , First Publish Date - 2022-06-04T18:31:07+05:30 IST
Hyderabad: జూబ్లిహీల్స్ అత్యాచార ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పబ్లపై ప్రభుత్వానికి
Hyderabad:జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పబ్లపై ప్రభుత్వానికి నియంత్రణ కొరవడినందున, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మైనర్లను పబ్ల్లోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నంచారు. కేంద్రం ప్రతిపక్షాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, కట్టడి చేయడం కోసం ఈడీని వాడుకుంటున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ ప్రతిక దేశ స్వతంత్ర పోరాటం లో కీలకపాత్ర పోషించిందని, సోనియా, రాహుల్ దేశం కోసం అస్తులనే రాసిచ్చిన కుటుంబం సోనియాదని గుర్తుచేశారు.