బలాత్కారం చేసిన అమ్మాయినే పెళ్లిచేసుకున్న నిందితుడు.. కోర్టు ఆదేశాలతో..

ABN , First Publish Date - 2021-02-27T01:22:58+05:30 IST

గతేడాది నమోదైన అత్యాచారం కేసులో బాధితురాలిని నిందితుడు పెళ్లి చేసుకున్నాడు. పోస్కో కోర్టు ఆదేశాలతో ఈ వివాహం జరిగింది. ఒడిషాలోని జైలు ఆవరణలో ఈ వివాహం జరిగింది. గతేడాది జరిగిన ఈ ఘటనతో..

బలాత్కారం చేసిన అమ్మాయినే పెళ్లిచేసుకున్న నిందితుడు.. కోర్టు ఆదేశాలతో..

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది నమోదైన అత్యాచారం కేసులో బాధితురాలిని నిందితుడు పెళ్లి చేసుకున్నాడు. పోస్కో కోర్టు ఆదేశాలతో ఈ వివాహం జరిగింది. ఒడిషాలోని జైలు ఆవరణలో ఈ వివాహం జరిగింది. గతేడాది జరిగిన ఈ ఘటనతో బాధితురాలు గర్భవతి అయింది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిపై బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచగా.. పోక్సో కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. అయితే ఈ ఏడాది బాధితురాలికి 18 ఏళ్లు నిండడంతో ఆమెను నిందితుడు వివాహం చేసుకోవాలని, అప్పుడే అతడి బెయిల్ పిటిషన్‌పై ఆలోచిస్తామని కోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల సమక్షంలో, జైలు ఆవరణలోనే వీరిద్దరి వివాహం జరిగింది.

Updated Date - 2021-02-27T01:22:58+05:30 IST