కేసు వాపస్ తీసుకోలేదని మైనర్ యువతిపై యాసిడ్

ABN , First Publish Date - 2020-02-03T20:27:53+05:30 IST

పదహారేళ్ల యువతిపై యాసిడ్ దాడి ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. అత్యాచారం కేసులో బాధితురాలైన సదరు యువతిపై నిందితుడి కుటుంబ సభ్యులే దాడి చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని హాపూర్‌కు చెందిన 16ఏళ్ల యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

కేసు వాపస్ తీసుకోలేదని మైనర్ యువతిపై యాసిడ్

పదహారేళ్ల యువతిపై యాసిడ్ దాడి ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.  అత్యాచారం కేసులో బాధితురాలైన సదరు యువతిపై నిందితుడి కుటుంబ సభ్యులే దాడి చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని హాపూర్‌కు చెందిన 16ఏళ్ల యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు వాపస్ తీసుకోవాలని నిందితుడి కుటుంబసభ్యులు యువతిని బెదిరించారు. దీనికి ఆ యువతి అంగీకరించలేదు. దీంతో ఆదివారం ఓ యాసిడ్ బాటిల్‌తో ఆమెను అడ్డగించిన నిందితుడి కుటుంబసభ్యులు.. ఆమె కాళ్లపై యాసిడ్ పోసి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించి, యాసిడ్ దాడి చేసిన వారిపై కేసు నమోదుచేసుకున్నారు.

Updated Date - 2020-02-03T20:27:53+05:30 IST