కన్నుల పండువగా రాపత్తు ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-01-21T05:08:20+05:30 IST

తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు గురువారం కనుల పండువగా జరిగాయి.

కన్నుల పండువగా రాపత్తు ఉత్సవాలు
రాపత్తు ఉత్సవంలో రంగనాథస్వామి

నెల్లూరు (సాంస్కృతికం), జనవరి 20 : తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు గురువారం కనుల పండువగా జరిగాయి. స్వామివారు ఉభయదేవేరులతో కలిసి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.  ఆళ్వార్లు గోష్టి. దివ్యనాలాయిర గోష్టి గానం, శాత్తుమురై, ఆరగింపుల వేడుకలు జరిగాయి. ఇదేవిధంగా మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయంలో రాపత్తు ఉత్సవంలో భాగంగా ఆళ్వారు గోష్టి, శాత్తుమురై జరిగాయి. 

Updated Date - 2022-01-21T05:08:20+05:30 IST