సీఎంను కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-04T18:09:19+05:30 IST

సీఎంను కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం

సీఎంను కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం

గుంటూరు: జిల్లాలోని చౌడవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న హైవే భద్రతా వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హిందూపురం సిల్స్ రీలర్ల సంఘం అధ్యక్షుడు రియాద్ అహ్మద్ మృతి చెందాడు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన పట్టు రీలర్లు తమ సమస్యలపై సీఎం కలిసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-12-04T18:09:19+05:30 IST