ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే: రంజిత్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-10T19:11:17+05:30 IST
ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.
ఢిల్లీ: ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. ఆదివారం రంజిత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను రెచ్చగొట్టి వరి వేసేలా చేసింది బీజేపీ నేతలేనని చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మాట్లాడారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతామని రంజిత్రెడ్డి హెచ్చరించారు.