సౌరాష్ట్ర 226/6
ABN , First Publish Date - 2020-02-21T10:05:24+05:30 IST
సౌరాష్ట్రతో రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్ పోరులో తొలిరోజు ఆంధ్ర బౌలర్ ఎర్రా పృథ్వీరాజ్ అదరగొట్టాడు. గురువారం మొదలైన ఈ మ్యాచ్లో ...
ఆంధ్రతో రంజీ క్వార్టర్స్
ఒంగోలు (ఆంధ్రజ్యోతి): సౌరాష్ట్రతో రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్ పోరులో తొలిరోజు ఆంధ్ర బౌలర్ ఎర్రా పృథ్వీరాజ్ అదరగొట్టాడు. గురువారం మొదలైన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు లెఫ్టామ్ మీడియం పేసర్ పృథ్వీరాజ్ (3/51) మూడు వికెట్లతో విజృంభించాడు. పృథ్వీకితోడు మరో బౌలర్ కేవీ శశికాంత్ (2/82) రెండు వికెట్లు పడగొట్టడంతో తొలిరోజు ఆట ముగిసేసరికి సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్లో 226/6 స్కోరు చేసింది. మరో వికెట్ను స్టీఫెన్ తీశాడు. సౌరాష్ట్ర బ్యాట్స్మెన్లో విశ్వరాజ్సింగ్ జడేజా (73), చిరాగ్ జాని (53 బ్యాటింగ్), షెల్డన్ జాక్సన్ (50) అర్ధసెంచరీలు చేశారు. ఓపెనర్ కిషన్ పర్మార్ 35 పరుగులు చేశాడు. క్రీజులో జానికి అండగా మన్కడ్ (0 బ్యాటింగ్) ఉన్నాడు.
మిగతా క్వార్టర్స్ తొలిరోజు స్కోర్లు: బెంగాల్ 308/6 (విదర్భతో), గుజరాత్ 330/4 (గోవాతో), కర్ణాటక 142/6 (జమ్మూ కశ్మీర్తో).