రాణీకే హాకీ పగ్గాలు
ABN , First Publish Date - 2021-06-22T05:58:15+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును రెగ్యులర్ కెప్టెన్ రాణీ రాంపాల్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును రెగ్యులర్ కెప్టెన్ రాణీ రాంపాల్ ముందుండి నడిపించనుంది. ఈ మేరకు రాణీకే పగ్గాలు అప్పగించినట్టు హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం ప్రకటించింది. అయితే, గతానికి భిన్నంగా ఈసారి ఇద్దరు వైస్ కెప్టెన్లను నియమించింది. దీప్గ్రేస్ ఎక్కా, సవిత ఉపసారథులుగా వ్యవహరిస్తారని హెచ్ఐ పేర్కొంది. కాగా.. విశ్వక్రీడలకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గతవారమే ప్రకటించినా కెప్టెన్ పేరును మాత్రం పెండింగ్లో పెట్టిన సంగతి తెలిసిందే.