రంగిశెట్టి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-14T06:15:52+05:30 IST

మండల గ్రామం చిలువూరులో కొవిడ్‌ బారినపడిన కుటుంబాలకు రంగిశెట్టి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలను గురువారం పంపిణీ చేశారు.

రంగిశెట్టి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
కొవిడ్‌ బాధిత కుటుంబీకులకు రంగిశెట్టి ఫౌండేషన్‌ అందించిన నిత్యావసరాలను అందజేస్తున్న సర్పంచ్‌ చిలువూరు మాణిక్యం

దుగ్గిరాల, మే 13: మండల గ్రామం చిలువూరులో కొవిడ్‌ బారినపడిన కుటుంబాలకు రంగిశెట్టి  ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలను గురువారం పంపిణీ చేశారు. 80 పేద కుటుంబాలకు 25కిలోల బియ్యం 3 కిలోల కందిపప్పు, 3కిలోల వంటనూనె తదితర నిత్యావసరాలను అందించారు. సర్పంచ్‌ చిలువూరు మాణిక్యం, శేషగిరిలు డాక్టర్‌ రంగిశెట్టి జగదీశ్‌బాబును ఫోన్‌ సంప్రదించిన వెంటనే స్పందించి నిత్యావసరాలను అందించారు.  రంగిశెట్టి ఫౌండేషన్‌ వారు, ఆపన్నహస్తం అందించినందుకు గానూ, పలువురు గ్రామపెద్దలు డాక్టర్‌ జగదీశ్‌బాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-05-14T06:15:52+05:30 IST