Ranagareddy: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

ABN , First Publish Date - 2022-01-18T15:18:51+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది.

Ranagareddy: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై దుర్గాప్రసాద్ అనే యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. శరీర వాంఛ తీరిన తరువాత యువకుడు ముఖం చాటేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి... తల్లిదండ్రుల సహాయంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దుర్గా వరప్రసాద్‌పై రేప్ కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నారు. గత ఆరు సంవత్సరాల నుండి ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-18T15:18:51+05:30 IST