రోడ్డుపై స్టంట్లు... అతివేగంతో ప్రాణాలమీదకు తెచ్చుకున్న బైక్ రైడర్
ABN , First Publish Date - 2022-01-16T14:48:44+05:30 IST
బైక్ రైడింగ్ యుడకుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. జిల్లాలోని రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి: బైక్ రైడింగ్ యుడకుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. జిల్లాలోని రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై బైక్ రైడర్స్ హల్చల్ చేశారు. పది స్పోర్ట్స్ బైక్లపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు రైడర్స్ బృందం బయలుదేరింది. రోడ్డుపై స్టంట్లు వేస్తూ రైయ్ రూయ్మంటూ దూసుకెళ్లాయి. ఈ క్రమంలో మైఖెల్ అనే రైడర్ బైక్ అదుపుతప్పి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్పై డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్ను ఢీ కొట్టి దాదాపు కిలో మీటర్ వరకు రాసుకుంటు వెళ్ళి మైఖేల్ బైక్ పడిపోయింది. ఈ ఘటనలో బైక్ తుక్కు తుక్క అయ్యింది. అలాగే మైఖేల్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మైఖేల్ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.