Rangareddy: సాయిబాబా ఆలయంలో చోరీ
ABN , First Publish Date - 2021-12-29T15:18:36+05:30 IST
జిల్లాలోని అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబా ఆలయంలో చోరీ జరిగింది.
రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబా ఆలయంలో చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని పగలగొట్టి సుమారు 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి ఉదయం వచ్చి చూసేసరికి ఆలయ ద్వారం తీసి, హుండీ పగులగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.