Rangareddy: తల్లితో పాటు ఇద్దరు చిన్నారుల మిస్సింగ్
ABN , First Publish Date - 2021-10-25T15:03:24+05:30 IST
జిల్లాలోని అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధి ఎమ్ఎమ్ పహాడిలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు.
రంగారెడ్డి: జిల్లాలోని అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధి ఎమ్ఎమ్పహాడిలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. నిన్న మధ్యాహ్నం తల్లి అమ్రీన్.. తన పిల్లలు అక్షబేగం, అజా బేగంలతో కలిసి ఇంటి నుండి బయటకు వెళ్లారు. కాగా సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త అబ్రార్ సమీప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశారు. చుట్టూ పక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అబ్రార్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.