రంగారెడ్డిలో ఆరేళ్ల బాలుడు అదృశ్యం
ABN , First Publish Date - 2021-10-22T14:12:25+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్గూడలో అనీష్ అనే ఆరేళ్ళ బాలుడు అదృశ్యం కలకలం రేపుతోంది.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్గూడలో అనీష్ అనే ఆరేళ్ళ బాలుడు అదృశ్యం కలకలం రేపుతోంది. మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటూ... భవనం నుండి కిందికి వచ్చిన బాలుడు తిరిగి ఇంట్లోకి రాకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. బాలుడి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం మూడు పోలీస్ బృందాలను రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు.