Rangareddy: టాటాఏస్ వాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-01-11T19:38:46+05:30 IST

జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి పోలీస్ అకాడమీ వద్ద ఔటర్‌పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

Rangareddy: టాటాఏస్ వాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి మృతి

రంగారెడ్డి: జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి పోలీస్ అకాడమీ వద్ద ఔటర్‌పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో... ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ రాంగ్ రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-01-11T19:38:46+05:30 IST