ఉరివేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-12-06T20:17:06+05:30 IST
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి శివరాంపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక అభిలాష్ (26) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి శివరాంపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక అభిలాష్ (26) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివరాంపల్లి ఆదర్శనగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో అవినాష్ ఉంటున్నారు. కాగా డిసెంబర్ 26 న అవినాష్ వివాహం నిశ్చయం అయింది. రూ.15 లక్షలు దాకా అవినాష్ అప్పుచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.