Rangareddy: కారును వెనుక నుండి ఢీకొన్న లారీ
ABN , First Publish Date - 2021-12-27T13:55:31+05:30 IST
జిల్లాలోని ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధి ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది.
రంగారెడ్డి: జిల్లాలోని ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధి ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న కారును ఓ లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా క్షతగాత్రులను హాస్పటల్కు తరలిస్తున్న క్రమంలో ఆగి ఉన్న కారును వెనుక నుండి మరో కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను ఎల్బినగర్ కామినేని హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.