పార్లమెంట్ను మోదీ బీజేపీ కార్యాలయంగా మార్చారు: రంగారెడ్డి
ABN , First Publish Date - 2020-09-25T20:52:35+05:30 IST
అమరావతి: పార్లమెంట్ను ప్రధాని మోదీ బీజేపీ కార్యాలయంగా మార్చారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు
అమరావతి: పార్లమెంట్ను ప్రధాని మోదీ బీజేపీ కార్యాలయంగా మార్చారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. పార్లమెంటులో చర్చ జరగకుండానే వ్యవసాయ బిల్లును ఆమోదించటం అనైతికమన్నారు. కేంద్రం తీరుతో రైతులు తమ పంటను అమ్ముకునే స్వేచ్ఛను కోల్పోయారన్నారు. ప్రధాని మోదీ కార్పోరేట్ వర్గాలకే కొమ్ముకాస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. వ్యవసాయ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని రంగారెడ్డి వెల్లడించారు.