Rangareddy: రన్నింగ్ కారులో మంటలు

ABN , First Publish Date - 2022-05-10T14:32:38+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్ గండి పేట వైజంక్షన్ వద్ద రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి.

Rangareddy: రన్నింగ్ కారులో మంటలు

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ గండి పేట వైజంక్షన్ వద్ద రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. కారులో నుండి మంటలు రావడాన్ని గుర్తించిన యజమాని వెంటనే కిందకు దిగాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే యజమాని కళ్ల ముందు కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారు యజమాని ప్రాణాలతో బయటపడ్డాడు. మెహదీపట్నం నుండి మొయినాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కారు యజమాని శ్రీ హరి ఓ పత్రికా విలేకరిగా గుర్తించారు. 

Read more