Rangareddy: ఏటీఎం చోరీకి విఫలయత్నం
ABN , First Publish Date - 2022-05-02T16:13:31+05:30 IST
జిల్లాలోని మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.
రంగారెడ్డి: జిల్లాలోని మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి ఏటీఎం మెసిన్ను దుండగుడు ఇనుప రాడ్తో పగులగొట్టాడు. కాగా... అలారం ఆక్టివేట్ కావడంతో అక్కడి నుంచి దొంగ పరారయ్యాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.