మానవత్వం చాటుకున్న రంగరాజన్
ABN , First Publish Date - 2020-06-05T10:00:25+05:30 IST
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గోశాలలో ఉన్న గోవులకు దాణా, పచ్చిగడ్డి, ఇతర ఆహార పదార్థాలను అందజేసి
గోవులకు దాణా, పచ్చిగడ్డి అందజేత
మొయినాబాద్ రూరల్: ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గోశాలలో ఉన్న గోవులకు దాణా, పచ్చిగడ్డి, ఇతర ఆహార పదార్థాలను అందజేసి చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ మానవత్వం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు సమీపంలో ఉన్న గోశాలలో దాదాపు 300 వరకు గోవులున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో గోవులకు సరిగ్గా దాణా, గడ్డి దొరకక ఇబ్బందులు పడుతున్నాయని తెలుసుకున్న రంగరాజన్.. గురువారం లారీ ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దాణా, ఇతర ఆహార పదార్థాలను అందజేశారు.