ఘనంగా రంగనాథస్వామి తిరు కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2022-05-27T05:27:25+05:30 IST
ఘనంగా రంగనాథస్వామి తిరు కల్యాణోత్సవం
షాద్నగర్ రూరల్, మే 26: ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద శివారు రంగథామంలో వెలసిన గోదారంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రంగనాయకస్వామి తిరు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మహాసుదర్శన హోమం, విష్ణుసహస్త్ర పారాయణం. రథోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్య హాజరై పూజలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. సర్పంచ్ లలిత, ఆలయ పూజారి కేశవాచార్యులు, జెడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, శ్యాంసుందర్, కృష్ణ, దయాసాగర్, శ్రీశైలం, రాము పాల్గొన్నారు.