Rangareddy: నీటిసంపులో పడి మూడేళ్ల బాలిక మృతి

ABN , First Publish Date - 2022-05-13T17:03:48+05:30 IST

జిల్లాలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది.

Rangareddy: నీటిసంపులో పడి మూడేళ్ల బాలిక మృతి

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ళ బాలిక (కుట్టి )మృతి చెందింది. నీటి సంపుకు ఉన్న మూత తెరిచి ఉండటంతో ప్రమాదం జరిగింది. బాలిక తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. మృతురాలు కొల్లాపూర్‌కు చెందిన సన, జగదీష్ నాయక్‌ల కూతురు. ఆడుకుంటున్న తమ కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read more