Ranga reddy: మీర్‌పేట్‌లో రెచ్చిపోయిన కబ్జారాయుళ్లు

ABN , First Publish Date - 2022-05-27T15:10:05+05:30 IST

జిల్లాలోని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కబ్జా రాయుళ్లు రెచ్చిపోయారు.

Ranga reddy: మీర్‌పేట్‌లో రెచ్చిపోయిన కబ్జారాయుళ్లు

రంగారెడ్డి: జిల్లాలోని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కబ్జా రాయుళ్లు రెచ్చిపోయారు. అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్ళిన మున్సిపల్ అధికారులపై కబ్జా రాయుళ్లు రాళ్లతో దాడి చేశారు. మహేశ్వరం నియోజకవర్గం జిల్లెల గూడ సర్వేనెంబర్ 124 లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. అయితే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి  బంధువుల బిల్డింగ్ కావడంతో కూల్చివేతలను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. తన అనుచరులతో కలిసి అధికారులపై రాంరెడ్డి రాళ్ల దాడికి దిగాడు. దాడిని చిత్రీకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది ఫోన్లు లాక్కొని బెదిరింపులకు దిగారు. అధికారుల ఫిర్యాదు మేరకు మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2022-05-27T15:10:05+05:30 IST