Ranga Reddy: దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి

ABN , First Publish Date - 2022-10-06T19:14:37+05:30 IST

దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ చెరువులో పడి...

Ranga Reddy: దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy Dist.): దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ చెరువులో పడి  శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. యువకుడిని కాపాడే ప్రయత్నం చేసినా.. అప్పటికే నీటలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సాగర్ వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. విషయం తెలుసుకున్న  శ్రీకాంత్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - 2022-10-06T19:14:37+05:30 IST