రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష సరైనదే: వాసిరెడ్డి పద్మ

ABN , First Publish Date - 2022-04-29T23:28:52+05:30 IST

రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష సరైనదే: వాసిరెడ్డి పద్మ

రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష సరైనదే: వాసిరెడ్డి పద్మ

అమరావతి: రమ్య హత్య కేసు నిందితుడికి ఉరి శిక్ష సరైనదే మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ తీర్పు పట్ల మహిళా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఆమె తెలిపారు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడటం ఓ రికార్డు అని, దిశ చట్టం స్ఫూర్తితో ప్రత్యేక న్యాయస్థానం ద్వారా విచారణ జరిగిందన్నారు. పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేశారని, మహిళలపై జరిగే దాడులకు సంబంధించి ఈ తీర్పు మైలురాయని, పోలీసులు చాలా బాగా పని చేశారని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Updated Date - 2022-04-29T23:28:52+05:30 IST