దళిత ద్రోహి కేసీఆర్‌కి, దళిత ద్వేషి హరీష్‌కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సందర్భమిది: రాములమ్మ

ABN , First Publish Date - 2021-10-26T16:44:09+05:30 IST

దళితులతో దారుణంగా ప్రవర్తించిన మంత్రి హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.

దళిత ద్రోహి కేసీఆర్‌కి, దళిత ద్వేషి హరీష్‌కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సందర్భమిది: రాములమ్మ

హైదరాబాద్: దళితులతో దారుణంగా ప్రవర్తించిన మంత్రి హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. దళిత ద్రోహి కేసీఆర్ గారికి, దళిత ద్వేషి హరీష్ రావుకు హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టవలసిన సందర్భమిది అని వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటు. అందుకు మొదట హరీష్ రావు గారు ముక్కు నేలకు రాసి దళితులకు క్షమాపణ చెప్పి ఉండాలి. ఇంతవరకూ చెయ్యలే. ఇక హరీష్ రావు దళిత బంధు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే.. దళిత ద్రోహి కేసీఆర్ గారికి, దళిత ద్వేషి హరీష్ రావుకు హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టవలసిన సందర్భం ఇది. ఈ హరీష్ రావు ఎన్ని కథలు పడ్డా కూడా కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి, ఈయనను పార్టీ నుంచి కేసీఆర్ గారు బయటకు వెళ్లగొట్టేది భవిష్యత్తులో తప్పని పరిణామం’’ అని రాములమ్మ పేర్కొన్నారు. 




Updated Date - 2021-10-26T16:44:09+05:30 IST