కోవింద్, మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2021-04-04T14:50:12+05:30 IST
దేశ ప్రజలందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : దేశ ప్రజలందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన ఇచ్చిన ట్వీట్లో, జీసస్ క్రైస్ట్ సామాజిక సాధికారతను నొక్కి వక్కాణించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనమందరం జీసస్ క్రైస్ట్ పవిత్ర బోధనలను స్మరించుకుందామన్నారు.
ఈస్టర్ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ ఫ్రైడేనాడు శిలువ వేసిన తర్వాత జీసస్ క్రైస్ట్ పునరుత్థానం చెందిన రోజును ఈస్టర్గా జరుపుకుంటామని పేర్కొన్నారు.