అందుకే జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడంలేదు: రామ్మోహన్ నాయుడు

ABN , First Publish Date - 2021-04-11T17:23:02+05:30 IST

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి తిరోగమనంలో సాగుతోందని...

అందుకే జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడంలేదు: రామ్మోహన్ నాయుడు

తిరుపతి: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి తిరోగమనంలో సాగుతోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఆదివారం ఉదయం తిరుపతి, ప్రకాశం పార్కులో రామ్మోహన్ నాయుడు ప్రచారం నిర్వహించారు. వాకర్స్‌తో మాట్లాడుతూ.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీకే ఓటు వేయాలని కోరారు. కేసులకు భయపడి సీఎం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని ఆరోపించారు.


చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు నడిపించారని రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఒక హబ్‌గా క్రియేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారని, తిరుపతిని ఒక స్థాయికి తీసుకువచ్చారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, తిరోగమనంలో సాగుతోందని విమర్శించారు. తిరుపతికి చాలా అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను అటకెక్కించారని, విభజన హామీ అమలు, రైల్వే జోన్ కోరడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి, తిరుపతికి మంచి జరగాలంటే.. కేంద్రాన్ని ఎదిరించే వ్యక్తిని ఎంపీగా ఎన్నుకోవాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Updated Date - 2021-04-11T17:23:02+05:30 IST