ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు: రామ్మోహన్‌ నాయుడు

ABN , First Publish Date - 2022-04-14T19:33:02+05:30 IST

జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు: రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం: జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. జగన్‌రెడ్డికి పరిపాలన చేతకాదన్నారు. ఓ వైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచి.. మరోవైపు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదని, రాక్షస ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం దారుణమని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-14T19:33:02+05:30 IST