AP News: గోరంట్ల మాధవ్పై లోక్సభ స్పీకర్కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-08-09T17:35:23+05:30 IST
ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్పై లోక్సభ స్పీకర్కు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ (Delhi): ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) ఎపిసోడ్పై లోక్సభ స్పీకర్కు టీడీపీ ఎంపీలు (TDP MPs) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) మీడియాతో మాట్లాడుతూ గోరంట్లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరామన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంపీ గోరంట్లను కాపాడాలని వైసీపీ నేతలు యత్నిస్తున్నారని, ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు మాట్లాడడం లేదని, ఎంపీ గోరంట్లపై చర్యలను తీసుకోవడానికి భయపడుతున్నారని విమర్శించారు.
గోరంట్ల వీడియో ఘటనను సజ్జల రామకృష్ణా రెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీలో గోరంట్ల మాధవ్ ఒక్కరే కాదని, ఎంతోమంది ఉన్నారని అన్నారు. గోరంట్లపై చర్యలు తీసుకుంటే.. ఇతర వైసీపీ నేతలపైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, చర్యలు తీసుకుంటే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని భయపడుతున్నారని విమర్శించారు. మహిళల గౌరవం కాపాడేందుకు టీడీపీ పోరాటం చేస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఒక పార్లమెంట్ సభ్యుడు ఇలా చేస్తే ప్రజలు ఏమనుకుంటారని రామ్మోహన్ నాయుడు అన్నారు. మహిళల గౌరవం కొరకు వైసీపీ నేతలు గోరంట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. మాధవ్ వీడియో వెనుక టీడీపీ కుట్ర ఉందని అంటున్నారని, అలా మాట్లాడడానికి సిగ్గు ఉండాలన్నారు. సజ్జల చర్యలు తీసుకుంటామని చెప్పారు, మళ్ళీ మాట ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడానికి ఎన్ని రోజులు పడుతుందని నిలదీశారు. మాధవ్పై చర్యకు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు.