ఏజెన్సీ డీఈవోగా రమేశ్‌ బాధ్యతల స్వీకారం

ABN , First Publish Date - 2021-09-29T06:18:51+05:30 IST

ఏజెన్సీ డీఈవోగా డాక్టర్‌ పి.రమేశ్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

ఏజెన్సీ డీఈవోగా రమేశ్‌ బాధ్యతల స్వీకారం


పాడేరు, సెప్టెంబరు 28: ఏజెన్సీ డీఈవోగా డాక్టర్‌ పి.రమేశ్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్డాన్స్‌డ్‌ స్టడీస్‌(ఐఏఎస్‌ఈ)కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై స్థానిక ఏజెన్సీ డీఈవోగా ప్రభుత్వం నియమించారు. ఇప్పటివరకు ఏజెన్సీ డీఈవోగా గిరిజన సంక్షేమ శాఖ డీడీ జి.విజయకుమార్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహించారు. ఏజెన్సీ డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌కు ఎంఈవోలు ఎస్‌.రామచంద్రరావు, సీహెచ్‌.సరస్వతి, సింహాచలం అభినందనలు తెలిపారు.

 

Updated Date - 2021-09-29T06:18:51+05:30 IST