సుశాంత్ కుటుంబం పరిస్థితి చూసి బాధేసింది: రాందేవ్ బాబా

ABN , First Publish Date - 2020-08-16T05:05:49+05:30 IST

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం రాందేవ్ బాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు...

సుశాంత్ కుటుంబం పరిస్థితి చూసి బాధేసింది: రాందేవ్ బాబా

ముంబై: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం రాందేవ్ బాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీని తాలూకు వీడియోను ఇవాళ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. సుశాంత్ కుటుంబం ఎంత బాధపడుతుందో తాను విన్నానంటూ ఈ వీడియోలో ఆయన పేర్కొన్నారు. వారి బాధ తన మనసును కలిచివేసిందన్నారు. ‘‘ఇవాళ మనం స్వాంతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. మనకు స్వాతంత్ర్యం లభించింది కాబట్టి ఎవరికీ అన్యాయం జరగకూడదు..’’ అని ఆయన అన్నారు. ‘‘హంతకులు సుశాంత్ జీవితాన్ని లాక్కెళ్లిపోయారు... ఆయన తన దేహాన్ని విడిచి వెళ్లిపోయారు.. కానీ కనీసం ఆయన కుటుంబానికైనా న్యాయం జరగాలి..’’ అని రాందేవ్ బాబా పేర్కొన్నారు. 



Updated Date - 2020-08-16T05:05:49+05:30 IST