Rambhupal: గోరంట్లది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కాదు

ABN , First Publish Date - 2022-08-16T18:26:10+05:30 IST

ఎంపీ గోరంట్లది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కాదని సీపీఎం నేత రాంభూపాల్ అన్నారు.

Rambhupal: గోరంట్లది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కాదు

అనంతపురం (Anantapuram): వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (MP Gorantla) ది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కాదని అనంతపురం జిల్లా సీపీఎం కార్యదర్శి  రాంభూపాల్ (Rambhupal)అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని ప్రభుత్వం సమర్థించడంతో గోరంట్ల ఊరు మీద పడి అంబోతులా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంపీని కంట్రోల్ చేయకపోతే నేరస్థులను ఏ విధంగా కంట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ చర్యను జిల్లా జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, మంత్రి ఉష శ్రీ (Usha Shri) సమర్థించే విధంగా మాట్లాడుతున్నారని, వారు ఏవిధంగా సమర్ధిస్తారని నిలదీశారు. సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్రమైన చర్య తీసుకుంటామంటే మహిళా మంత్రుల చేత ఎదురు దాడి చేయడమా?.. గోరంట్ల మాధవ్ నోరు మూసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు, కులానికి ఏమి సంబంధమన్నారు. కురుబ కులస్తులు గ్రామాల్లో చాలా సఖ్యతగా ఉంటారన్నారు. గోరంట్ల తన రాజకీయ స్వార్థం కోసం గ్రామంలో వైషమ్యాలు లేపుతారా? అంటూ దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గోరంట్ల లాంటి తప్పుడు మనుషులను సమర్థిస్తే ప్రజా క్షేత్రంలో బుద్ధి చెబుతారని రాంభూపాల్ అన్నారు.

Updated Date - 2022-08-16T18:26:10+05:30 IST