సంప్రదాయబద్ధంగా రాములోరి పట్టాభిషేకం

ABN , First Publish Date - 2020-04-04T11:11:29+05:30 IST

రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామచంద్రునికి పట్టాభిషేక మహోత్సవం శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

సంప్రదాయబద్ధంగా రాములోరి పట్టాభిషేకం

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 3:  రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామచంద్రునికి పట్టాభిషేక మహోత్సవం  శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థానంలో నవమిని పురస్కరించుకుని గురువారం సీతారాముల కల్యాణోత్సవం జరిగిన సంగతి విదితమే.  దశమి సందర్భంగా శుక్రవారం పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ప్రాతఃకాలార్చన, బాలభోగం అయిన తర్వాత ముందుగా యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు చేపట్టారు.


తర్వాత ఆస్థాన మండపంలోకి స్వామిని ఆహ్వానించి ప్రత్యేక అర్చనలు చేశాక పట్టాభిషేక సర్గ విన్నపం చేశారు. పంచామృత స్నపనం చేసి శ్రీరామచంద్రస్వామికి కిరీట ధారణ చేశారు. పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రధాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులతో పాటు అర్చకులు కిరణ్‌, గొడవర్తి నరసింహాచార్యులు, ప్రసాద్‌, పవన్‌కుమార్‌ తదితరులు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను దేవస్థానం ఈవో బీహెచ్‌ వీఎస్‌ఎన్‌ కిషోర్‌కుమార్‌ పర్యవేక్షించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఈ కార్యక్రమానికి కూడా భక్తులకు అనుమతించలేదు. 

Updated Date - 2020-04-04T11:11:29+05:30 IST