ట్విట్టర్ వేదికగా రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-05-26T21:58:57+05:30 IST
ట్విట్టర్ వేదికగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల: ట్విట్టర్ వేదికగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్ జరగాలని రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాల ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్ జరపాలని ఆయన పేర్కొన్నారు. తన డిమాండ్లను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి ట్వీట్ చేశారు.