16 నెలలు గడిచినా ఇసుక కష్టాలు తీరలేదు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-10-06T19:22:16+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

16 నెలలు గడిచినా ఇసుక కష్టాలు తీరలేదు: రామకృష్ణ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ‘‘ మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఇసుక కష్టాలు తీరలేదు. మీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. 10 టైర్ల లారీ ఇసుక గతంలో రు.6 వేలు ఉండగా ప్రస్తుతం రు. 30 వేలకు చేరింది. ఇసుక మాఫియా కనుసన్నల్లో టన్నుల కొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతోంది. కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి వారి సంక్షేమ నిధులు రు.450 కోట్లు మళ్లించడం తగదు. తక్షణమే ఇసుకను ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టి, భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోండి’’ అంటూ రామకృష్ణ లేఖ రాశారు.

Updated Date - 2020-10-06T19:22:16+05:30 IST