సీఎం జగన్ రైతుల్ని మోసం చేశారు: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-11-01T19:22:52+05:30 IST

రైతుల మహాపాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని రామకృష్ణ స్పష్టం చేశారు.

సీఎం జగన్ రైతుల్ని మోసం చేశారు: రామకృష్ణ

విజయవాడ: అమరావతి రైతుల మహాపాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే గృహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, వైకాపా నాయకులు ప్రచారం చేసుకున్నారని... అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రైతుల్ని మోసం చేశారని విమర్శించారు. బీజేపీ కూడా స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని, ద్వంద్వ ప్రమాణాలు మాని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరను వ్యతిరేకించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. 37 మంది ఎంపీలు ఉన్నా.. ప్రధాని వద్దకు వెళ్లి అర్జీ ఇవ్వలేని చేతకాని వారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోరారు. ఒంటరి అయ్యానని పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరి కాదన్నారు. అన్ని రంగాల వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, సీఎం జగన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకపోతే.. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని రామకృష్ణ సూచించారు.

Updated Date - 2021-11-01T19:22:52+05:30 IST