రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా ఆర్‌కే మఠ్‌లో పుస్తకాలపై 40% డిస్కౌంట్

ABN , First Publish Date - 2022-03-04T03:39:43+05:30 IST

హైదరాబాద్: రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా మార్చ్ 4వ తేదీన (తిథి ప్రకారం) రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది.

రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా ఆర్‌కే మఠ్‌లో పుస్తకాలపై 40% డిస్కౌంట్

హైదరాబాద్: రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా మార్చ్ 4వ తేదీన (తిథి ప్రకారం) రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది. వివేకానంద సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.


ఉదయం ఐదున్నరకు సుప్రభాతం, మంగళారతి, భజనలుంటాయి. ఆరున్నర గంటలకు దేవాలయ ప్రదక్షిణం ఉంటుంది. 7 గంటలకు విశేష పూజ, భజనలుంటాయి. పదిన్నరకు హోమం నిర్వహిస్తారు. 11 గంటలా 15 నిమిషాలకు రామకృష్ణ పరమహంస జీవితం, సందేశంపై తెలుగులో ప్రసంగం ఉంటుంది. 11 గంటలా 40 నిమిషాలకు రామకృష్ణ పరమహంస జీవితం, సందేశంపై ఆంగ్లంలో ప్రసంగం ఉంటుంది. 12:05 నిమిషాలకు విశేష హారతి, మధ్యాహ్నం 12:15 గంటలకు భోజన ప్రసాదం ఉంటుంది. సాయంత్రం 6:45కు ఆరాత్రికం, 7:15కు ప్రత్యేక భజనలుంటాయి. కార్యక్రమాలను యూ ట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. 


Updated Date - 2022-03-04T03:39:43+05:30 IST