జగన్కు రామకృష్ణ లేఖ
ABN , First Publish Date - 2022-03-06T20:32:49+05:30 IST
సీఎం జగన్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఏపీ హైకోర్టు తీర్పును గౌరవించాలని సూచించారు.
అమరావతి: సీఎం జగన్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఏపీ హైకోర్టు తీర్పును గౌరవించాలని సూచించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్ర అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించాలని లేఖలో కోరారు. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా.. రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.