క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన వసతులు కల్పించాలంటూ...

ABN , First Publish Date - 2020-07-06T13:24:46+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారికి సరైన ఆహార, మెరుగైన వసతి

క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన వసతులు కల్పించాలంటూ...

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారికి సరైన ఆహార, మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘నాణ్యమైన భోజనం, మంచినీళ్లు, మందులు కరవై జనాలు దీనావస్థలో మగ్గుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రు.500లు ఖర్చు పెడుతున్నప్పటికి యంత్రాంగం, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఫుడ్ ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. రాష్ట్రంలో మొదట్లో కరోనా టెస్టులు విస్తృతంగా జరిగినా.. ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నవి. విజయవాడలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రోజుల తరబడి కిట్లు లేవనే సాకుతో టెస్టులు చేయలేదు. కొందరు అధికారులు, సిబ్బంది అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది.’’ అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2020-07-06T13:24:46+05:30 IST