వైద్యుల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-07-11T13:55:14+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ‘‘కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యుల సంఘం ఆవేదనాపూరిత లేఖ

వైద్యుల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ‘‘కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యుల సంఘం ఆవేదనాపూరిత లేఖ రాయటం దురదృష్టకరం. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వైద్యులు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఇతోధిక సేవలందిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ తరచూ ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయడం వల్ల వైద్యులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మాస్కులు గ్లౌజులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్‌పై అమానుషంగా ప్రవర్తించారు. డాక్టర్ అనితారాణి విషయంలో కూడా అవమానకరంగా ప్రవర్తించారు. పలువురు ఐఏఎస్ అధికారులు డీఎం అండ్ హెచ్‌వోలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదు. తక్షణం వైద్యుల ఇబ్బందులను గ్రహించి, అధికారులు వైద్యులతో సమన్వయంగా వ్యవహరించేలా చూడాలని కోరుతున్నాను.’’ అంటూ లేఖలో రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-07-11T13:55:14+05:30 IST