అధానీ భార్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-03-08T17:41:33+05:30 IST
ఆధానీ భార్యకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తుందని సీపీఐ రామకృష్ణ వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
గుంటూరు: అధానీ భార్యకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తుందని సీపీఐ రామకృష్ణ వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మంగళవారం ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో రామకృష్ణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాష్టాన్ని అంబానీ, ఆధానీకి దోచిపెడుతుందని మండిపడ్డారు. మహిళ దినోత్సవం అట్టహాసంగా చేస్తున్నారు కానీ రాష్ట్రంలో మహిళలపై దాడులు అరికట్టలేకపోతున్నారని చెప్పారు.గవర్నర్ ప్రసంగంలో మహిళల ఖాతాలో డబ్బులు జమయ్యాయని చెప్పారు కానీ అప్పులు ఎంత తెచ్చారో చెప్పలేదని అన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం వైసీపీ కరపత్రంలా ఉందని రామకృష్ణ దెప్పిపోడిశారు.