AP News: సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-07-22T17:47:37+05:30 IST
రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. అంతా బాగుందని జగన్ ప్రభుత్వం చెబుతోందని రామకృష్ణ విమర్శించారు.
విజయవాడ (Amaravathi): రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. అంతా బాగుందని జగన్ ప్రభుత్వం (Jagan Government) చెబుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీ (AP) ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని, అప్పులు.. ఖర్చులపై వైట్ పేపర్ (White paper)రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దిగే నాటికి రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల మేర అప్పు ఉండడం ఖాయమన్నారు. అప్పులు చేస్తున్నారు.. కానీ అభివృద్ధి ఎక్కడా కన్పించడం లేదని అన్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, ఏపీ అభివృద్ధికి జగన్ సైంధవుడిలా అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. విలీన మండలాల్లోని ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని తీర్మానం చేశారంటే.. సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలని రామకృష్ణ అన్నారు.